ఒకటి నుంచి అంగన్‌వాడీల్లో భోజనం

ABN , First Publish Date - 2022-06-26T03:59:00+05:30 IST

జూలై ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్బిణులకు, బాలింతలకు భోజనంతోపాటు ఐరన్‌ మాత్రలు, పాలు, ఉడికించిన

ఒకటి నుంచి అంగన్‌వాడీల్లో భోజనం
సమావేశంలో సూచనలిస్తున్న సీడీపీవో సౌజన్య

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌25: జూలై  ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే గర్బిణులకు, బాలింతలకు  భోజనంతోపాటు ఐరన్‌ మాత్రలు, పాలు, ఉడికించిన గుడ్లు పంపిణీ చేయనున్నట్టు సీడీపీవో సౌజన్య తెలిపారు. శనివారం బుచ్చిలోని సీడీపీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలతో స్పాట్‌ ఫీడింగ్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరోనా వల్ల  రెండేళ్లుగా బాలింతలు, గర్భిణులకు, చిన్నారులకు ఇళ్ల వద్దకే  పౌష్టికాహారం అందజేశామన్నారు. జూలై ఒకటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజనం తినిపించాలని ఆదేశించారు.  కేంద్రాల్లో చిన్నారులకు నేర్పించాల్సిన విద్యతోపాటు పలు సూచనలు చేశారు.


Updated Date - 2022-06-26T03:59:00+05:30 IST