ప్రముఖ సాహితీవేత్త గురుప్రసాదరావు మృతికి జూలూరు సంతాపం

ABN , First Publish Date - 2022-02-22T01:10:21+05:30 IST

ప్రఖ్యాత సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమి భాషా సమ్మాన్ అవార్డు గ్రహీత నాగళ్ల గురుప్రసాదరావు మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంతాపం తెలిపారు.

ప్రముఖ సాహితీవేత్త గురుప్రసాదరావు మృతికి జూలూరు సంతాపం

హైదరాబాద్: ప్రఖ్యాత సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమి భాషా సమ్మాన్ అవార్డు గ్రహీత నాగళ్ల గురుప్రసాదరావు మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంతాపం తెలిపారు.ఆయన సోమవారం గురు ప్రసాదరావు విజయవాడలోని తన స్వగృహంలో మరణించారన్న వార్త తనకు బాధకలిగించిందన్నారు. ఆయన విజయవాడ సిద్ధార్థ అకాడమీలో తెలుగు అద్యాపకునిగా సేవలందిస్తూ సిద్ధార్థ కళాపీఠం ద్వారా 30 ఏళ్లుగా సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంప్రదాయ సాహిత్యంలో దిట్టగా నిలిచారు. ప్రాచీన సాహిత్యంపై మంచి పట్టుందని అన్నారు. 

Updated Date - 2022-02-22T01:10:21+05:30 IST