మెదక్‌ సబ్‌జైలును సందర్శించిన న్యాయమూర్తి

ABN , First Publish Date - 2021-09-19T04:05:40+05:30 IST

జిల్లా న్యాయ సేవ అధికార సంస్ధ ఆదేశాల మేరకు శనివారం మెదక్‌ సబ్‌ జైలును 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి మంత్రి రామకృష్ణాసునీత సందర్శించారు.

మెదక్‌ సబ్‌జైలును సందర్శించిన న్యాయమూర్తి

మెదక్‌ అర్బన్‌, సెప్టెంబరు 18: జిల్లా న్యాయ సేవ అధికార సంస్ధ ఆదేశాల మేరకు శనివారం మెదక్‌ సబ్‌ జైలును 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి మంత్రి రామకృష్ణాసునీత సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం చర్చి కాంపౌండ్‌లోని సంధ్యా నిలయాన్ని సందర్శించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలసుకున్నారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి లావణ్య, జ్యుడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ర్జేట్‌ సాయికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T04:05:40+05:30 IST