సనాతన ధర్మం నిత్యనూతనం

ABN , First Publish Date - 2022-10-02T05:48:40+05:30 IST

భారతీయ సనాతన ధర్మ నిత్యనూతనంగా, దేదీప్యమానంగా వెలుగొందుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్‌ అన్నారు.

సనాతన ధర్మం నిత్యనూతనం
సభలో ప్రసంగిస్తున్న న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్‌

హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్‌


గుంటూరు (సాంస్కృతికం), అక్టోబరు1: భారతీయ సనాతన ధర్మ నిత్యనూతనంగా, దేదీప్యమానంగా వెలుగొందుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్‌ అన్నారు. స్థానిక శ్యామలానగర్‌ సంతోషిమాత ఆలయ ప్రాంగణంలో వేద పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం శాస్త్ర పండిత సన్మానసభ జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి బొప్పూడి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ వేదాలు, పురాణాలు భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలన్నారు. జగద్గురువు ఆదిశంకరులు అవతార పురుషులని, వారు చూపిన మార్గంలో అడుగులు వేయాలన్నారు. సభకు శ్రీహరి సీతారామమూర్తి ఘనాపాటి అధ్యక్షత వహించారు. సభలో సంస్థ అధ్యక్షుడు గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్‌, తాడేపల్లి సింహాద్రిశాస్త్రి, శ్రీనివాసమూర్తి, రాళ్ళబండి వీఎస్‌ఆర్‌ శర్మ, మూర్తిలు పాల్గొని ప్రసంగించారు. విష్ణుభట్ట శ్రీకృష్ణ ఘనాపాటి వేదస్వస్తి నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులను ఘనంగా సత్కరించారు. 

Updated Date - 2022-10-02T05:48:40+05:30 IST