ఇటుక బట్టీలపై హైకోర్టులో ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-01-24T05:42:55+05:30 IST
పైడిమెట్ట, గజ్జరం రహదారిలో అనేక ఇటుక బట్టీల కారణంగా భారీ వృక్షాలు, రైతుల పంటలకు నష్టం జరుగుతోందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గజ్జరం గ్రామానికి చెందిన గన్నిన సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు.
గజ్జరంలో న్యాయమూర్తి బాలకృష్ణ విచారణ
తాళ్లపూడి, జనవరి 23: పైడిమెట్ట, గజ్జరం రహదారిలో అనేక ఇటుక బట్టీల కారణంగా భారీ వృక్షాలు, రైతుల పంటలకు నష్టం జరుగుతోందని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గజ్జరం గ్రామానికి చెందిన గన్నిన సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో శనివారం జిల్లా లీగల్ సెల్ అథారిటీ సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాలకృష్ణతో పాటు కొవ్వూరు ఆర్డీవో లక్ష్మారెడ్డి విచారణ చేపట్టడానికి గజ్జరం విచ్ఛేశారు. స్థానికులు, బాధితులతో ఇటుక బట్టీల వ్యవహారంపై సమీక్షించి, వాదులు, ప్రతివాదుల నుంచి సమాచారాన్ని సేకరించారు. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జడ్జి హెచ్చరించారు. తహసీల్దారు నర్శింహమూర్తి, ఆర్ఐ క్రాంతికుమారి, పలువురు ఇటుకబట్టీల యజమానులు పాల్గొన్నారు.