ఉప లోకాయుక్తగా ‘బాబ్రీ’ తీర్పు ఇచ్చిన జడ్జి

ABN , First Publish Date - 2021-04-13T07:51:20+05:30 IST

రిటైర్‌ అయిన న్యాయమూర్తి రాజేంద్ర కుమార్‌ యాదవ్‌ సోమవారం ఉత్తరప్రదేశ్‌ ‘ఉప-లోకాయుక్త’గా ప్రమాణ స్వీకారం చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ

ఉప లోకాయుక్తగా ‘బాబ్రీ’ తీర్పు ఇచ్చిన జడ్జి

లఖ్‌నవూ, ఏపిల్ర్‌ 12: రిటైర్‌ అయిన న్యాయమూర్తి రాజేంద్ర కుమార్‌ యాదవ్‌ సోమవారం ఉత్తరప్రదేశ్‌ ‘ఉప-లోకాయుక్త’గా ప్రమాణ స్వీకారం చేశారు. అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్‌ నేతలు ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతితో పాటు 32 మందిని నిర్దోషులుగా తేల్చుతూ గత ఏడాది సెప్టెంబరు 30న కేంద్ర దర్యాప్తు బృందం ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఆ కోర్టు న్యాయమూర్తిగా రాజేంద్ర కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2021-04-13T07:51:20+05:30 IST