24న రాష్ట్రానికి J P Nadda రాక

ABN , First Publish Date - 2021-11-15T16:12:28+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే చర్యలను ఆ పార్టీ అధిష్ఠానం ముమ్మరం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల

24న రాష్ట్రానికి J P Nadda రాక

చెన్నై/పెరంబూర్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే చర్యలను ఆ పార్టీ అధిష్ఠానం ముమ్మరం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల యాల నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుప్పూర్‌, తిరునల్వేలి, తిరుపత్తూర్‌, వాణియంబాడీ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన కార్యాల యాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా తిరుప్పూర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించ నున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తిరునల్వేలి, వాణియంబాడీ, తిరుపత్తూర్‌ కార్యాలయా లను ప్రారంభించనున్నారు. ఆ రోజున తిరుప్పూర్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, సమా వేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చింనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-11-15T16:12:28+05:30 IST