జోయాలుక్కాస్.. ఫ్యాక్టరీ ధరల సేల్
ABN , First Publish Date - 2022-05-25T09:11:14+05:30 IST
జోయాలుక్కాస్.. వినియోగదారుల కో సం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది.
హైదరాబాద్: జోయాలుక్కాస్.. వినియోగదారుల కో సం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్లోని పంజాగుట్ట షో రూమ్లో ఫ్యాక్టరీ ధరల సేల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంపిక చేసిన డిజైన్స్పై జూన్ 5 వరకు ఈ సేల్ పంజాగుట్ట షోరూమ్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఫ్యాక్టరీ ధరల సేల్ సమయంలో కస్టమర్లు బం గారు ఆభరణాల కొనుగోలుతో పాటు ఎంపిక చేసిన డిజైన్స్పై పూర్తిగా మజూరు చార్జీలు ఆదా చేయవచ్చని తెలిపింది. మజూరీ చార్జీలను అసలు చెల్లించకుండా కేవలం బంగారం ధరని చెల్లించటం ద్వారా వినియోగదారులు తమకిష్టమైన ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఈ ప్రత్యేకమైన ఆఫర్ అవకాశం కల్పిస్తుందని జోయాలుక్కాస్ పేర్కొంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్కి అదనంగా కస్టమర్ బైబ్యాక్ గ్యారంటీతో పాటు జోయాలుక్కాస్ నుంచి కొనుగోలు చేసిన అన్ని ఆభరణాల కోసం జీవిత కాలం ఉచిత నిర్వహణ హామీ, ఏడాది వరకు ఉచిత బీమాని వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది.