రానున్న రోజుల్లో రైలు ప్రయాణాలు ఇలా...
ABN , First Publish Date - 2020-07-05T22:27:43+05:30 IST
మరి కొద్ది రోజుల్లో రైలు ప్రయాణాలు సమూలంగా మారిపోనున్నాయి. ప్లాట్ఫాం మొదలుకుని, టిక్కెట్ల జారీ, స్టేషన్లు... ఇలా ప్రతీ వషయంలోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆహారాన్నైతే... పొట్లం కట్టి మాత్రమే ఇస్తారు.
న్యూఢిల్లీ : మరి కొద్ది రోజుల్లో రైలు ప్రయాణాలు సమూలంగా మారిపోనున్నాయి. ప్లాట్ఫాం మొదలుకుని, టిక్కెట్ల జారీ, స్టేషన్లు... ఇలా ప్రతీ వషయంలోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆహారాన్నైతే... పొట్లం కట్టి మాత్రమే ఇస్తారు.
రైల్వే స్టేషన్లు కూడా ఇప్పుడు విమానాశ్రయాల్లా మారిపోయాయి. అక్కడ ఉన్నట్టే రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణానికి నాలుగు గంటల ముందు రిపోర్ట్ చెయ్యాల్సి వస్తోంది. ఎయిర్ పోర్ట్లలో ఎలా స్కీృనింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారో... రైల్వే స్టేషన్లలో కూడా అదే విధానం అమలవుతోన్న విషయం తెలిసిందే.
బాత్రుమ్ల ముందు శానిటైజర్లు ఉంచుతారు. అలాగే ప్రయాణీకులు కూడా శానిటైజర్లను తమతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కానీ క్రమంగా కొన్ని రైళ్లు నడవటం మొదలయ్యింది. తిరిగి రైళ్ల రాకపోకల్ని పూర్వ స్థితికి తీసుకొచ్చే క్రమంలో రైల్వే శాఖ కొన్ని కొత్త నియమ నిబంధనల అమలు తప్పనిసరి చేయవచ్చు.