జర్నలిస్టులకు ఇళ్లు, కార్లు ఇవ్వాలి: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2022-03-14T21:43:14+05:30 IST
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ఇళ్లు, కార్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులకు ఇళ్లు, కార్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టులకు అవి ఇస్తే ఒక టర్మ్ పోటీ చేయనని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజలకు తాను సమాధానం చెబుతానన్నారు. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్పై వ్యతిరేకతతో కాంగ్రెస్లో చేరలేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే గతంలో పార్టీ మారానని జగ్గారెడ్డి తెలిపారు.