రౌడీయిజంతోనే వైసీపీ ఏకగ్రీవాలు
ABN , First Publish Date - 2021-03-05T05:34:09+05:30 IST
రౌడీయిజంతోనే మున్సి పల్ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవాలు చేసుకు న్నదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరో పించారు.
మాజీ మంత్రి పితాని సత్యనారాయణ
నరసాపురం, మార్చి 4: రౌడీయిజంతోనే మున్సి పల్ ఎన్నికల్లో వైసీపీ ఏకగ్రీవాలు చేసుకు న్నదని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరో పించారు. గురువారం నరసాపురంలో ఆయన పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. వైసీపీకి ఓటు వేయకపోతే వ్యవ సాయానికి అందించే నీరు, ప్రభుత్వ పఽథకాలు నిలిపివేస్తామని బెదిరిం పులకు కూడా పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ముందెన్నడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి సంస్కృతి కనిపించిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీరు సైతం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కోసం వైసీపీ కార్పొరేట్ సంస్థతో చీకటి ఒప్పందం చేసుకుందని పితాని ఆరోపించారు. ఈనెల 5వ తేదీన జరిగే బంద్కు టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఆయన వెంట పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ పొత్తూరి రామరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కొప్పాడ రవీంద్ర, మాజీ జడ్పీటీసీ గుబ్బల నాగరాజు,మాజీ సర్పంచ్ మామిడిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.