హైకోర్టుకు జర్నలిస్ట్ రఘు భార్య లక్ష్మీప్రవీణ
ABN , First Publish Date - 2021-06-04T22:37:57+05:30 IST
జర్నలిస్ట్ రఘు భార్య లక్ష్మీప్రవీణ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: జర్నలిస్ట్ రఘు భార్య లక్ష్మీప్రవీణ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించి ప్రతివాదులకు హైకోర్టు నోటీసులిచ్చింది. అరెస్ట్ అక్రమమో.. కాదో తేలుస్తామని హైకోర్టు పేర్కొంది. బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రబోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లిన రఘును మధ్యలో అడ్డుకుని జీపులో ఎక్కించారు. పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్న తీరు.. అరెస్ట్కు ముందు కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో.. కిడ్నాప్ అంటూ కలకలం రేగిన విషయం తెలిసిందే.