మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన జర్నలిస్టు నేతలు

ABN , First Publish Date - 2021-11-06T20:07:26+05:30 IST

రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల మృతి చెందారు.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన జర్నలిస్టు నేతలు

మహబూబ్ నగర్: రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ నేపధ్యంలో శనివారం ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ)అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ తదితరులు మహబూబ్ నగర్ లోని ఆయన నివాసంలో మంత్రిని పరామర్శించారు.అలాగే శాంతమ్మకు నివాళుర్పించారు. ఈసందర్భంగా కార్యక్రమంలో  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, హెచ్.యు.జె కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, యూనియన్ నాయకుడు అహ్మద్ పాషా, మహబూబ్ నగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-06T20:07:26+05:30 IST