వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృతమైన మార్పులు

ABN , First Publish Date - 2021-10-18T05:31:08+05:30 IST

వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృతమైన మార్పులు

వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృతమైన మార్పులు

ప్రముఖ జర్నలిస్టు, రచయిత  జయదీప్‌ హర్ధికర్‌

కేయూ క్యాంపస్‌, అక్టోబరు 17 .. భారతీయ వ్యవసాయ రంగంలో వ్యవస్థీకృతమైన మార్పులు రావాలని, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని ముందుకు తీసుకురావాలంటే రైతులకు విని యోగదారులకు వ్యవస్థలను అనుసంధానం చే యాలని మహరాష్ట్ర వ్యవసాయ రంగ విశ్లేషకుడు, ప్రముఖ జర్నలిస్టు జయదీప్‌ హర్థికర్‌ అన్నారు. ఆదివారం మాజీ మంత్రి తక్కళ్ళపల్లి పురుషోత్త మరావు నివాసంలో తెలంగాణ జనవేదిక ఆధ్వ ర్యంలో ‘సంక్షోభంలో భారతీయ వ్యవసాయం-రాం రావ్‌ ఒక కథ’ అనే అంశంపై ఆన్‌లైన్‌ జూమ్‌ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాప క కన్వీనర్‌ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంలో జరిగిన సదస్సులో జయదీప్‌ హర్థికర్‌ ముఖ్యఅతి థిగా పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 

భారతదేశంలో వ్యవసాయ రంగం సంక్షోభం లోకి నెట్టివేయపడుతోందని.. రైతుల్లో సంఘటిత వ్యవస్థలేదని చెప్పారు. ఆరుగాలం కష్టపడిన రైతు లు అప్పులు, అవమానలతో ఆత్మహత్యలకు పాల్ప డాల్సిన దుస్థితి నెలకొందని చెప్పారు. ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల్లో చిత్తశుద్ధి లేదని, సామా న్య, పేద రైతులకు భారత ప్రభుత్వ శాస్త్రవేత్తల అవిష్కరణలు, ఫలితాలు అందడం లేదన్నారు. వి దర్భ, తెలంగాణ, మహరాష్ట్ర, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, బుందేల్‌ఖండ్‌లో నాందేడ్‌, మధ్యప్రదేశ్‌లో రైతులు ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారని అన్నారు. 1990వ దశకంలో విదర్భ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళు- సంక్షోభం, రైతు ల అవస్థలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, రైతుల ఆర్థిక క ష్టాలు, ఆత్మహత్యలను విశ్లేషణాత్మకంగా చర్చించి నట్లు తెలిపారు. సంస్థాగతమైన మార్పులతో పా టు వ్యవస్థీకృతమైన విప్లవాత్మకమార్పులతోనే వ్య వసాయ రంగాన్ని గాడిలో పడుతోందని చెప్పారు. సామాజిక, సహకార  వ్యవసాయంతో రైతులకు బేరమాడే శక్తి లభిస్తోందని చెప్పారు. సకల సమ స్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చె ప్పారు. ప్రధానంగా వ్యవసాయరంగాన్ని ప్రజలతో అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వాలు చిన్న రైతులను సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పా రు. సమావేశంలో సంయోజకులుగా డాక్టర్‌ ఆకు తోట శ్రీనివాసులు వ్యవరించగా డాక్టర్‌ కొట్టే భా స్కర్‌, జేమ్స్‌ ప్రశాంత్‌, బజార్‌ రంగారావు, డాక్టర్‌ దొంతి నర్సింహరెడ్డి, ప్రీతిశర్మ, నవీన, ప్రదీప్‌, ప్రొఫెసర్‌ సీహెచ్‌ బలరాములు, డాక్టర్‌ సోమరాతి భిక్షపతి, పెండ్లి అశోక్‌బాబు, అమీర్‌బేగ్‌, అర్జున్‌రా వు, ప్రొఫెసర్‌ బిష్ణుచరణ్‌చౌదరి, హరిభూషన్‌, మ హేశ్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, రాజమౌళి, శ్రీధర్‌రాజు, స్వాతిమిశ్రా, మార్నేని ఉదయబానురావు  తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T05:31:08+05:30 IST