పేకాడుతూ పట్టుబడిన పత్రికా విలేఖరి
ABN , First Publish Date - 2022-08-10T06:10:29+05:30 IST
విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొరపల్లిలో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు.
కారు, సెల్ ఫోన్ సీజ్
విశాఖపట్నం, ఆగస్టు 9: విశాఖ జిల్లా పెందుర్తి మండలం గొరపల్లిలో పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 13 మందిని అరెస్టు చేశారు. ఒక కారు, రూ.50 వేల నగదును స్వాఽధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గొరపల్లిలో చిక్కాల అప్పారావు అనే వ్యక్తికి చెందిన కమ్మలపాకలో పేకాట నిర్వహిస్తున్నట్టు అందిన సమాచారం మేరకు దాడి చేశారు. పట్టుబడిన వారిలో పెందుర్తికి చెందిన ఓ విలేఖరి వున్నట్టు, అతనికి చెందిన కారు, సెల్ ఫోన్ను సీజ్ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.