నవతరానికి మార్గదర్శకుడు జాషువా: ఎంపీ
ABN , First Publish Date - 2021-07-25T06:36:00+05:30 IST
నవతరానికి మా ర్గదర్శకుడు గుఱ్ఱం జాషువా అని ఎంపీ తలారి రంగయ్య అ న్నారు.
అనంతపురం ప్రెస్క్లబ్, జూలై24: నవతరానికి మా ర్గదర్శకుడు గుఱ్ఱం జాషువా అని ఎంపీ తలారి రంగయ్య అ న్నారు. స్థానిక ఎన్జీఓ హోంలోని సమావేశపు హాల్లో శనివారం జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో మహాకవి గుఱ్ఱం జాషు వా 50వ వర్ధంతి సభ నిర్వహించారు. ముందుగా టవర్క్లాక్ స మీపంలోని ఆయన విగ్రహానికి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ని వాళి అర్పించారు. ఎస్కేయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, జా షువా సాహిత్య పీఠం అధ్యక్షుడు ఆచార్య బాలసుబ్రహణ్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఎంపీ రంగయ్య, జాషువా సాహిత్య పీఠం ప్రధాన కార్యదర్శి హెచ నాగలింగయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చం ద్రశేఖర్రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మనిషిని మని షిగా గుర్తించి గౌరవించాలనే ఆయన సిద్ధాంతాలు నేటి యు వతకు ఆదర్శమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నానీల నాగేం ద్ర, బీఎస్పీ నాయకుడు గద్దల నాగభూషణం, డాక్టర్ డీ జనా ర్దన రెడ్డి, గంగిరెడ్డి అశ్వత్థ రెడ్డి, చందనా శివాజీ, తూముచెర్ల రాజారాం, తరిమెల అమర్నాథరెడ్డి, నాగేశ్వరాచారీ, చంద్రశేఖర్ శాస్ర్తి, కంబదూరు షేక్ నభీరసూల్, ఎస్సీ,ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, ఎంఈఎఫ్ గంగాదర్, సాకే భాస్కర్, లిటిల్ ఫ్లవర్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.