Rahul పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-08T22:16:15+05:30 IST

పార్టీ అగ్రనేత రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు

Rahul పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్: పార్టీ అగ్రనేత రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌లో జోష్ వచ్చిందని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌలు రైతులకు ఆశలు పెంచిందన్నారు. రాహుల్‌ పర్యటనపై బీజేపీ నేత బండి సంజయ్, మాజీ ఎంపీ అసదుద్దీన్, మంత్రి కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన బయటబడిందని తెలిపారు. జీఎస్టీ (GST) కశ్మీర్ (Kashmir) విషయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చారా లేదా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం ఇచ్చిన తెలంగాణ మీద మీరు బ్రతుకుతున్నారని దుయ్యబట్టారు. సిగ్గులేకుండా రాహుల్ గాంధీ ఎవరు అని మాట్లాడుతున్నారని, అవకాశం ఉండి కూడా ప్రధాని పదవిని తిరస్కరించిన గొప్ప నేత రాహుల్ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు

Read more