జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం బాయ్‌కాట్

ABN , First Publish Date - 2021-11-12T21:57:52+05:30 IST

పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై అధికారులు

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం బాయ్‌కాట్

అమరావతి: పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై అధికారులు ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని 10 ఉద్యోగ సంఘాలు బహిష్కరించాయి. 




సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశమైన సంగతి తెలిసిందే. సమావేశానికి 13 ఉద్యోగ సంఘాలు హాజరయ్యాయి. సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరైనారు. పీఆర్సీ సహా ఉద్యోగుల ఆర్థిక పరమైన అంశాలపై చర్చించారు. పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందన బట్టి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - 2021-11-12T21:57:52+05:30 IST