9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

ABN , First Publish Date - 2021-08-06T00:20:15+05:30 IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశాన్ని ఈనెల 9న

9న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం

హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశాన్ని ఈనెల 9న నిర్వహిస్తున్నట్లు కేఆర్ఎంబీ తెలిపింది. హైదరాబాద్‌లోని జలసౌధలో రెండు బోర్డుల ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేఆర్ఎంబీ పేర్కొంది. అత్యవసరంగా సమావేశాన్ని రెండు బోర్డులు ఏర్పాటు చేసాయి. ఈ సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చ జరుపుతారు. ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ ఇచ్చింది.  

Updated Date - 2021-08-06T00:20:15+05:30 IST