డిజిటల్‌ భవనాన్ని అందుబాటులోకి తేవాలి : జేసీ

ABN , First Publish Date - 2021-07-25T05:05:52+05:30 IST

మండలంలోని పీఎంలంకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిధులతో నిర్మించిన డిజిటల్‌ భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని జాయింట్‌ కలెక్టర్‌(డవలప్‌మెంట్‌) హిమాన్షు శుక్లా ఆదేశించారు.

డిజిటల్‌ భవనాన్ని అందుబాటులోకి తేవాలి : జేసీ
భవనాన్ని పరిశీలిస్తున్న జేసీ హిమాన్షు శుక్లా

నరసాపురం రూరల్‌, జూలై 24: మండలంలోని పీఎంలంకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిధులతో నిర్మించిన డిజిటల్‌ భవనాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని జాయింట్‌ కలెక్టర్‌(డవలప్‌మెంట్‌) హిమాన్షు శుక్లా ఆదేశించారు.  వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారం ఆయన భవనాన్ని పరిశీలించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనంలోని ప్రతి గది వినియో గంలోకి రావాలన్నారు. తీర ప్రాంతంలోని నిరుద్యోగ యువత నైపుణ్య అభివృద్ధికి సంబంధించిన శిక్షణ తరగతులు అందుబాటులోకి తేవాలన్నారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ విష్టుచరణ్‌, డీఆర్‌డీఏ పీడీ ఉదయ్‌భాస్కర్‌, ఉపాధి కల్పన మేనేజర్‌ కళ్యాణి, తహసీల్దార్‌ మల్లికార్జునరెడ్డి, ఎంపీడీవో ప్రసాద్‌యాదవ్‌, కమిషనర్‌ సత్యవేణి, ఏపీవో పద్మ తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2021-07-25T05:05:52+05:30 IST