టీకాలు వేయించుకొంటే ‘ఉమ్మడి కార్డు’

ABN , First Publish Date - 2021-08-06T07:49:04+05:30 IST

కొవిడ్‌ రెండు డోసుల టీకాలు తీసుకొన్న వారికి ఒక ‘ఉమ్మడి కార్డు’ ఇచ్చి వారు ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళేలా అనుమతించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

టీకాలు వేయించుకొంటే ‘ఉమ్మడి కార్డు’

ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచన

ముంబై, ఆగస్టు 5: కొవిడ్‌ రెండు డోసుల టీకాలు తీసుకొన్న వారికి ఒక ‘ఉమ్మడి కార్డు’ ఇచ్చి వారు ఎక్కడికైనా నిరాటంకంగా వెళ్ళేలా అనుమతించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. టీకాలు ఇంకా వేయించుకోని ప్రజల నుంచి వారిని విడిగా ఉంచేందుకు ఇది ఉపకరిస్తుందని సీజే దీపాంకర్‌ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తెలిపింది. రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకొన్న వారిని గతంలో  మాదిరిగా లోకల్‌ రైళ్ళలో ప్రయాణించేందుకు, వారి పనులు చేసుకొనేందుకు అనుమతించాలని ధర్మాసనం సూచించింది. ‘ఉమ్మడి కార్డు’ జారీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. 

Updated Date - 2021-08-06T07:49:04+05:30 IST