పల్లె సమక్షంలో టీడీపీలో చేరిక

ABN , First Publish Date - 2022-06-29T05:51:57+05:30 IST

మండలంలోని తంగేడుకుంట గ్రామానికి చెందిన తలుపుల మునెప్ప, కుమారుడు తలుపుల నరసింహులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైసీపీలో నుంచి టీడీపీలోకి మంగళవారం చేరారు.

పల్లె సమక్షంలో టీడీపీలో చేరిక
మాజీ మంత్రి పల్లె సమక్షంలో టీడీపీలో చేరిన నాయకులు

ఓబుళదేవరచెరువు, జూన 28: మండలంలోని తంగేడుకుంట గ్రామానికి చెందిన తలుపుల మునెప్ప, కుమారుడు తలుపుల నరసింహులు, వారి కుటుంబ సభ్యులతో పాటు వైసీపీలో నుంచి టీడీపీలోకి మంగళవారం చేరారు. మండలానికి వచ్చిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో మండల కన్వీనర్‌ శెట్టివారి జయచంద్ర ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి పల్లె పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈకార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్యే అత్తర్‌ చాంద్‌బాషా, నాయకులు బుదిలి ఓబులరెడ్డి, షబ్బీర్‌, నిజాం, ఆర్‌ఎంపీ జాకీర్‌, సర్పంచ శంకర్‌రెడ్డి, బిసిసెల్‌ ఆంజనప్ప, మండోజీ ఆర్ఫీఖాన, చాంద్‌బాషా, సునిల్‌కుమార్‌, ఆదినారాయణనాయక్‌, మస్తానమ్మ, అఖిల తదితరులున్నారు. 


Updated Date - 2022-06-29T05:51:57+05:30 IST