టీడీపీలో పలువురి చేరిక
ABN , First Publish Date - 2022-08-15T05:24:21+05:30 IST
పట్టణంలోని తొమ్మిదవ వార్డుకు చెందిన పలువురు యువకులుమాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, నియోజకవర్గ ఇనఛార్జీ కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఆదివారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
కదిరిఅర్బన, ఆగస్టు 14 : పట్టణంలోని తొమ్మిదవ వార్డుకు చెందిన పలువురు యువకులుమాజీ ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, నియోజకవర్గ ఇనఛార్జీ కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో ఆదివారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజల సమస్యలపై టీడీపీ పోరాటాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కందికుంట మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. రాజధాని ఎక్కడుందో చెప్పుకోలేని స్థితిలో ఉన్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. తిరిగి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో శివప్రసాద్, హరి, దినేష్, బాను, వెంకటేష్, నందకుమార్, నవీన, హరీష్, రాజేష్, సాయి ఉన్నారు. కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోపూరిశెట్టి చంద్రమోహన, నాయకులు రాజ శేఖర్బాబు, నాగేంద్రప్రసాద్, రిజ్వాన పాల్గొన్నారు.