పీఎస్సార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

ABN , First Publish Date - 2022-07-03T03:59:54+05:30 IST

దండేపల్లి మండలంలోని పలు గ్రామా లకు చెందిన టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు వెయ్యి మంది మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లక్షెట్టిపేట ఎస్‌పీఆర్‌ గార్డెన్‌లో శనివారం 23 గ్రామాల నుంచి పార్టీలో చేరగా వారికి పీఎస్సార్‌ కండువా కప్పి ఆహ్వానించారు.

పీఎస్సార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారితో మాజీ ఎమ్మెల్సీ పీఎస్సార్‌, డీసీసీ అధ్యక్షురాలు

దండేపల్లి/లక్షెట్టిపేటరూరల్‌, జూలై 2: దండేపల్లి మండలంలోని పలు గ్రామా లకు చెందిన టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సుమారు వెయ్యి మంది  మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు  సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లక్షెట్టిపేట ఎస్‌పీఆర్‌ గార్డెన్‌లో శనివారం 23 గ్రామాల నుంచి పార్టీలో చేరగా వారికి పీఎస్సార్‌  కండువా కప్పి  ఆహ్వానించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంద న్నారు. చీటి సత్యంరావు, నెల్కి సుభాష్‌ అనుచరులతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో గడ్డంత్రిమూర్తి, అక్కల శకుంతల, ప్రవీణ్‌రెడ్డి, వెం కటేశ్వర్లు, కంది సతీష్‌, శ్రీనివాస్‌, నవీన్‌, కమలాకర్‌, మోహన్‌ పాల్గొన్నారు. 

బూత్‌ స్థాయి నుండి పార్టీ బలోపేతం  

ఏసీసీ: బూత్‌ స్థాయి నుంచి కాంగ్రెస్‌ పార్టీని  బలోపేతం చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురే ఖలు అన్నారు. శనివారం ఆయన నివాసంలో పట్టణంలోని 12 వార్డుల నుంచి వివిధ పార్టీలకు చెందిన దాదాపు 500 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి అన్ని వేళలా అండగా నిలుస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ పని తీరుపై నమ్మకం కోల్పోయి స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో  చేరడానికి ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు  నరేష్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతి, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పెంట రజిత, హేమలత, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. తిరుపతి, సల్ల మహేష్‌, వేముల సంజీవ్‌, గాండ్ల శేఖర్‌, శ్రీనివాస్‌, దోమల రమేష్‌, గట్టు రమేష్‌, స్రవంతి, పెంట రమేష్‌, రజిత, కొమురయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

 

Updated Date - 2022-07-03T03:59:54+05:30 IST