సింగిల్ డోస్ జే అండ్ జే కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది...
ABN , First Publish Date - 2021-02-25T17:03:47+05:30 IST
కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్నిదేశాలు...
వాషింగ్టన్: కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు అన్నిదేశాలు మూకుమ్మడిగా పోరాటం సాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అన్ని దేశాల్లోనూ వేగవంతంగా కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ జాన్సన్ అండ్ జాన్సన్ తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్... కోవిడ్-19ను తరిమికొట్టడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ వ్యాక్సిన్కు త్వరలోనే అనుమతులు లభించనున్నాయి. కరోనా నుంచి కాపాడేందుకు వస్తున్న వ్యాక్సిన్లు రెండు డోసులుగా తీసుకోవాల్సి వస్తోంది. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టీకా ఒక డోస్ తీసుకోవడం ద్వారా కరోనా రాకుండా కాపాడుకోవచ్చు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం జే అండ్ జే వ్యాక్సిన్ సురక్షితమైనదని, కరోనా వ్యాధి స్థాయి తీవ్రంగా ఉన్నప్పుడు 66 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తెలిపారు.