‘జొహాన్నెస్బర్గ్’ కెప్టెన్గా డుప్లెసి
ABN , First Publish Date - 2022-08-16T10:10:23+05:30 IST
సౌతాఫ్రికా టీ20 లీగ్లో జొహాన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసి సారథిగా వ్యవహరించనున్నాడు.
జొహాన్నె్సబర్గ్: సౌతాఫ్రికా టీ20 లీగ్లో జొహాన్నెస్బర్గ్ సూపర్ కింగ్స్ జట్టుకు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసి సారథిగా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్.. ‘జొహాన్నెస్బర్గ్’ జట్టును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చెన్నైకు ఆడిన, ఆడుతున్న క్రికెటర్లు, సహాయ సిబ్బందికి మేనేజ్మెంట్ పెద్ద పీట వేసింది. ప్రస్తుతం చెన్నై కోచ్గా ఉన్న ఫ్లెమింగ్ను జొహాన్నెస్బర్గ్ జట్టుకు కోచ్గా నియమించింది. డుప్లెసితోపాటు మొయిన్ అలీ (ఇంగ్లండ్), మహీష్ తీక్షణ (శ్రీలంక), రొమారియో షెప్పర్డ్ (వెస్టిండీస్), గెరాల్డ్ కోట్జే (సౌతాఫ్రికా)ను నేరుగా కొనుగోలు చేసింది. ఆరుజట్ల సౌతాఫ్రికా లీగ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది.