Jofra Archer: టీమిండియాతో టెస్టు మ్యాచ్కు అర్చర్ దూరం
ABN , First Publish Date - 2022-05-19T22:56:02+05:30 IST
నడుము కిందభాగం గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ (England) పేసర్ జోఫ్రా అర్చర్ ఈ సీజన్ మొత్తానికి
లండన్: నడుము కిందభాగం గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ (England) పేసర్ జోఫ్రా అర్చర్ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే, ఈ ఏడాది జులైలో భారత్తో జరగనున్న రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్కు కూడా దూరమైనట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. నడుము కింద భాగం స్ట్రెస్ ఫ్రాక్చర్ అయినట్టు పరీక్షల్లో తేలిందని బోర్డు పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగతా సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తెలిపింది. అయితే, అతడు మళ్లీ జట్టులోకి ఎప్పుడొచ్చేదీ చెప్పలేదు.
గత సీజన్లో మిగిలిపోయిన ఒక టెస్టు మ్యాచ్తో పాటు మూడు టీ20, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు (Team India) ఇంగ్లండ్లో పర్యటించనుంది. టీమిండియా జూన్ చివరి వారంలో ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. వామప్ మ్యాచ్ తర్వాత తొలుత రీషెడ్యూల్ టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత ఆరు వైట్బాల్ మ్యాచ్లు జరుగుతాయి. 27 ఏళ్ల అర్చర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను మార్చి 2021లో ఆడాడు. ఇంగ్లండ్ తరపున అన్ని ఫార్మాట్లలోనూ కలిపి ఇప్పటి వరకు 42 మ్యాచ్లు ఆడిన అర్చర్ 86 వికెట్లు తీసుకున్నాడు.