నోబెల్ శాంతి బహుమతికి జో బైడెన్ నామినేట్!

ABN , First Publish Date - 2020-09-30T21:55:17+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న వేళ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన పార్లమెంట్ స

నోబెల్ శాంతి బహుమతికి జో బైడెన్ నామినేట్!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్ 3న ఎన్నికలు జరగనున్న వేళ డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్.. నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు క్రిస్ బ్రియాంట్.. జో బైడెన్ పేరును నామినేట్ చేశారు. ఈ సందర్భంగా.. ఇతరులు హింసాత్మక పరిష్కారాలను ఆశ్రయించిన వేళ.. చర్చల ద్వారా సమస్యలను  పరిష్కారించుకోవాలని జో బైడెన్ వాదించిట్లు ఆయన చెప్పారు. ‘తుపాకులు.. గుండె కొట్టుకోకుండా చేయగలవు. కానీ మంచి మాటలు ఎన్నో హృదయాలను మార్చగలవు. ఆ హృదయాలు ప్రపంచాన్నే మారుస్తాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ఇదిలా ఉంటే..  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడి పేరును నార్వే పార్లమెంట్ సభ్యుడు క్రిస్టియన్ ట్రైబిడ్రే జెడ్డే నామినేట్ చేసిన విషయం తెలిసిందే. నోబెల్ పురస్కారినిక సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడవు జనవరి 31తో ముగుస్తుంది. అక్టోబర్ 9న విజేతల పేర్లు వెల్లడవుతాయి. 


Updated Date - 2020-09-30T21:55:17+05:30 IST