మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తాం: కేటీఆర్
ABN , First Publish Date - 2021-03-05T22:52:39+05:30 IST
టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇన్చార్జీలు
హైదరాబాద్: టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇన్చార్జీలు, నాయకులు, పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1,33,000 ఉద్యోగాలిచ్చామని తెలిపారు. మరో 50 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నామని కేటీఆర్ ప్రకటించారు.