ఎన్టీపీసీలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-07-03T06:26:48+05:30 IST

సింహాద్రి ఎన్టీపీసీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొయింటెనెన్స్‌ ఉద్యోగాలను ఇవ్వాలని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి సంస్థ జీజీఎం గిరీశ్‌చంద్ర చౌక్సేకు విజ్ఞప్తి చేశారు.

ఎన్టీపీసీలో నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి
జీజీఎం గిరీశ్‌చంద్ర చౌక్సేను సన్మానిస్తున్న బండారు


  జీజీఎం గిరీశ్‌చంద్ర చౌక్సేకు  మాజీ మంత్రి బండారు విజ్ఞప్తి

పరవాడ, జూలై 2 : సింహాద్రి ఎన్టీపీసీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొయింటెనెన్స్‌ ఉద్యోగాలను ఇవ్వాలని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి సంస్థ జీజీఎం గిరీశ్‌చంద్ర చౌక్సేకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సంస్థలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేసిన పలువురు ఇటీవల కరోనాతో మృతి చెందారని, వారి స్థానాల్లో కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని కోరారు. అలాగే టీడీపీకి చెందిన నిర్వాసితులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మాజీ జడ్పీటీసీ పైలా జగన్నాథరావు, అట్టా నాయకులు సన్యాసిఅప్పారావు, వియ్యపు చిన్నా, కె. శ్రీరా మ్మూర్తి, ఇందల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:26:48+05:30 IST