గోపులారంలో జాబ్మేళా
ABN , First Publish Date - 2022-05-25T05:45:04+05:30 IST
గోపులారంలో జాబ్మేళా
చేవెళ్ల, మే 24: మండలంలోని గోపులారం గ్రామంలో మంగళవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. ఈసందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ జాబ్మేళాలో 25మంది యువకులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపిక అయిన యువకులకు శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తారని చెప్పారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో డీఆర్డీఏ అధికారులు, యువకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.