2 నుంచి బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-30T06:17:17+05:30 IST

జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) ఇంజనీరింగ్‌ తృతీయ ఏడాది పరీక్షలు నవంబరు 2 నుంచి ప్రారంభం కానున్నట్టు ప్రిన్సిపాల్‌ బి.బాలకృష్ణ తెలిపారు.

2 నుంచి బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌  పరీక్షలు

 జేఎన్టీయూకే, అక్టోబరు 29: జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూకే) ఇంజనీరింగ్‌ తృతీయ ఏడాది పరీక్షలు నవంబరు 2 నుంచి ప్రారంభం కానున్నట్టు ప్రిన్సిపాల్‌ బి.బాలకృష్ణ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జేఎన్టీయూకే కళాశాల పరిధిలో ఉన్న సివిల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్సు, ఎలకి్ట్రకల్‌, ఎలకా్ట్రనిక్స్‌, పెట్రో కెమికల్‌, పెట్రోలియం విభాగాలకు నవంబరు 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తృతీయ ఏడాది సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. హాల్‌కు 15 మంది విద్యార్థులు మాత్రమే  పరీక్షలు రాసేలా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కొవిడ్‌ పాజిటివ్‌ సోకిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-10-30T06:17:17+05:30 IST