జీవో 317ను సవరించాలి
ABN , First Publish Date - 2022-01-23T05:48:12+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317ను సవరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలను చేపట్టారు.
ఆదిలాబాద్, జనవరి22 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 317ను సవరించాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు జాదవ్ అశోక్కుమార్ మాట్లాడుతూ స్థానికత కోసం సాధించుకున్న రాష్ట్రంలో స్థానికతను కోల్పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వెంటనే 317 జీవోను సవరించి స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులను స్థానికత ఆధారంగా విధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. స్పౌస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందులో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మూగ శ్రీనివాస్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, టీఎస్టీఎఫ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌహాన్నరేష్, ఏటీఏ నాయకులు లక్ష్మణ్, శ్రీరాం,సురేష్, అనిత, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.