జియో ఫైబర్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లు

ABN , First Publish Date - 2021-06-16T06:10:48+05:30 IST

జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. నెలకు రూ.399 కనీస చార్జీతో ఈ పథకాలను అందుబాటులోకి తేనున్నట్లు.. 6, 12 నెలల కాలపరిమితి

జియో ఫైబర్‌ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లు

రూ.399 నుంచి ప్రారంభం 


హైదరాబాద్‌: జియో ఫైబర్‌ పోస్ట్‌పెయిడ్‌ పథకాలను ప్రవేశపెడుతున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. నెలకు రూ.399 కనీస చార్జీతో ఈ పథకాలను అందుబాటులోకి తేనున్నట్లు.. 6, 12 నెలల కాలపరిమితి ఆప్షన్లను సైతం అందించనున్నట్లు  తెలిపింది. పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు సెక్యూరిటీ డిపాజిట్‌, ఇన్‌స్టాలేషన్‌ చార్జీలు చెల్లించనక్కర్లేదని, తద్వారా రూ.1,500 ఆదా చేయవచ్చని స్పష్టం చేసింది. 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ కోసం మాత్రం రూ.1000 రిఫండబుల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రూ.999 లేదా అంతకు పైగా విలువ చేసే పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను ఎంచుకున్నవారికి 15 ఓటీటీ యాప్‌ల సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

Updated Date - 2021-06-16T06:10:48+05:30 IST