జియో కొత్త ఆఫర్: రూ. 249, అంతకంటే ఎక్కువ రిచార్జీ చేసుకుంటే..

ABN , First Publish Date - 2020-06-04T00:21:56+05:30 IST

జియో కస్టమర్లకు 4x బెనిఫిట్స్ పేరిట రిలయన్స్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రిచార్జ్ చేసుకున్న వారికి డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది.

జియో కొత్త ఆఫర్: రూ. 249, అంతకంటే ఎక్కువ రిచార్జీ చేసుకుంటే..

ముంబై: జియో కస్టమర్లకు 4x బెనిఫిట్స్ పేరిట రిలయన్స్ కొత్త ఆఫర్ ప్రకటించింది. రూ. 249 లేదా అంత కంటే ఎక్కువ మొత్తంతో రీచార్జ్ చేసుకున్న వారికి ఓకే విలువ గల నాలుగు డిస్కౌంటు కూపన్లు ఇస్తామని తెలిపింది. రిలయన్స్ డిజిటల్, ట్రెండ్స్, ట్రెండ్స్‌ఫుట్‌వేర్‌, ఎజియోలలో ఈ కూపన్ల ద్వారా కోనుగోళ్లపై డిస్కౌంట్లు పొందవచ్చని తెలిపింది. రీచార్చి చేసుకున్న తరువాత కూపన్లన్నీ మైజియో యాప్‌లోని కూపన్స్ సెక్షన్‌లో జమ అవుతాయని, షాపింగ్ చేసేటప్పుడు వీటితో డిస్కోంట్లను పొందవచ్చని(రిడీమ్) తెలిపింది. ఇప్పటికే రిచార్జ్ చేసుకున్న వారు కూడా ఈ ఆఫర్‌ని వినియోగించుకునే అవకాశాన్ని రిలయన్స్ కల్పించింది. ఇటువంటి వినియోగదారులు చేసిన రిచార్జిలన్నీ.. అడ్వాన్స్ రిచార్జీల వలె మై ప్లాన్స్ సెక్షన్‌లో నిక్షిప్తం అవుతాయని, ప్రస్తుత రీచార్జి ప్యాక్ వ్యాలిడిటీ పూర్తయిన తరువాత కస్టమర్లు దీన్ని వినియోగించే అవకాశం ఉంటుందని తెలిపింది. జూన్ 1 నుంచి 30 వరకూ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. 


Updated Date - 2020-06-04T00:21:56+05:30 IST