జిన్నాటవర్కు పటిష్ట భద్రత
ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST
గుంటూరు జిన్నాటవర్కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల బీజేపీ నాయకులు జిన్నాటవర్ను కూల్చివేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపఽథ్యంలో టవర్కు చుట్టూ ఐరన్ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
టవర్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
గుంటూరు (కార్పొరేషన్), జనవరి 23: గుంటూరు జిన్నాటవర్కు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇటీవల బీజేపీ నాయకులు జిన్నాటవర్ను కూల్చివేస్తామంటూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో టవర్కు చుట్టూ ఐరన్ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. రోడ్డు నుంచి 8 అడుగుల ఎత్తులో చుట్టూ ఎవరూ దగ్గరకు రాకుండా ఉండే విధంగా సుమారు రూ.3 లక్షల వ్యయంతో కార్పొరేన్ అధికారులు పెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు జిన్నాటర్ను పరిశీలించారు. నగరంలో ప్రజలు కులమతాలకు అతీతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని అటువంటి వారి మధ్య కులమతాల చిచ్చు పెట్టడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజల తదితరులు పాల్గొన్నారు.