పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి

ABN , First Publish Date - 2020-11-30T05:15:58+05:30 IST

రాష్ట్రంలో పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి తెలిపారు.

పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి
పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయలక్ష్మిని సత్కరిస్తున్న సంఘం నాయకులు

ఏపీ పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్‌పర్సన్‌ విజయలక్ష్మి

గుంటూరు, నవంబరు 29: రాష్ట్రంలో పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి  కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి తెలిపారు. ఆమెతో పాటు డైరక్టర్‌లకు ఆ సంఘం జిల్లా, నగర నాయకుల ఆధ్వర్యంలో గుజ్జనగుండ్లలోని ప్రగడకోటయ్య భవన్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది.  కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా, నగర నాయకులు ఉన్నారు. 

 

Updated Date - 2020-11-30T05:15:58+05:30 IST