పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి
ABN , First Publish Date - 2020-11-30T05:15:58+05:30 IST
రాష్ట్రంలో పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైౖర్పర్సన్ జింకా విజయలక్ష్మి తెలిపారు.
ఏపీ పద్మశాలీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైౖర్పర్సన్ విజయలక్ష్మి
గుంటూరు, నవంబరు 29: రాష్ట్రంలో పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైౖర్పర్సన్ జింకా విజయలక్ష్మి తెలిపారు. ఆమెతో పాటు డైరక్టర్లకు ఆ సంఘం జిల్లా, నగర నాయకుల ఆధ్వర్యంలో గుజ్జనగుండ్లలోని ప్రగడకోటయ్య భవన్లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా, నగర నాయకులు ఉన్నారు.