క్వారంటైన్కు జార్ఖండ్ వలస కూలీలు
ABN , First Publish Date - 2020-03-29T09:32:44+05:30 IST
తమిళనాడు నుంచి సొంతూరు జార్ఖండ్కు గూడ్స్ ఆటోలో వెళ్తున్న 12 మందిని హనుమాన్ జంక్షన్లో పోలీసులు శనివారం అడ్డుకున్నారు
హనుమాన్జంక్షన్ : తమిళనాడు నుంచి సొంతూరు జార్ఖండ్కు గూడ్స్ ఆటోలో వెళ్తున్న 12 మందిని హనుమాన్ జంక్షన్లో పోలీసులు శనివారం అడ్డుకున్నారు. లాక్డౌన్ కారణంగా రవాణా సాధనాలు లేకపోవడంతో గూడ్స్ ఆటోలో రెండురోజుల క్రితం బయలుదేరారు. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న జంక్షన్వద్ద పోలీసులు అడ్డుకున్నారు. 12 మందిలో యవకులతో పాటు మహిళ, ఓ చిన్నారి ఉన్నారు. రెండు రోజులుగా భోజనం కూడా లేదని చెప్పడంతో ట్రాఫిక్ ఎస్సై మదీనా బాషా వారందరికీ దాతలు సాయంతో భోజనాలు పెట్టించి గన్నవరం క్వారంటైన్కు, అక్కడి నుంచి విజయవాడ రైల్వే హాస్పిటల్ క్వారెంటైన్కు తరలించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.