సాక్షాత్తూ జడ్జి ఇంట్లోనే దోపిడీ

ABN , First Publish Date - 2020-11-21T13:23:00+05:30 IST

సాక్షాత్తూ స్పెషల్ కోర్టు జడ్జి ఇంట్లోనే దోపిడీ జరిగిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది....

సాక్షాత్తూ జడ్జి ఇంట్లోనే దోపిడీ

భోపాల్ (మధ్యప్రదేశ్): సాక్షాత్తూ స్పెషల్ కోర్టు జడ్జి ఇంట్లోనే దోపిడీ జరిగిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరంలోని ప్రత్యేక కోర్టు అదనపు జిల్లా జడ్జి అదేష్ జైన్ దీపావళి పండుగ సందర్భంగా కుటుంబంతో కలిసి గ్రామానికి వెళ్లారు. పండుగ తర్వాత జడ్జి ఇంటికి తిరిగి వచ్చాక చూస్తే ఇంట్లో ున్న బంగారం, వెండి ఆభరణాలు రూ.10 లక్షల విలువగలవి పోయాయి. జడ్జి ఆదేష్ జైన్ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జడ్జి ఇంట్లోని పనిమనిషి ఈ దోపిడీకి పాల్పడిందని పోలీసులు చెప్పారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Updated Date - 2020-11-21T13:23:00+05:30 IST