క్వారంటైన్‌ వసతులపై జేసీ ఆరా

ABN , First Publish Date - 2021-04-24T04:24:00+05:30 IST

మండల పరిధిలోని గోపవ రం గ్రామ సమీపంలోగల పశువైద్య కళాశాలలో క్వారంటైన్‌ ఏర్పాటుకు మౌలిక వసతులపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ఆరా తీశారు.

క్వారంటైన్‌ వసతులపై జేసీ ఆరా
పశువైద్య కళాశాల బాలుర వసతి గృహాన్ని పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి

ప్రొద్దుటూరు రూరల్‌, ఏప్రిల్‌ 23: మండల పరిధిలోని గోపవ రం గ్రామ సమీపంలోగల పశువైద్య కళాశాలలో క్వారంటైన్‌ ఏర్పాటుకు మౌలిక వసతులపై జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి ఆరా తీశారు.  శుక్రవారం రాత్రి కళాశాలలోని బాలు ర వసతి గృహాలను శనివారం నుంచి కరోనా క్వారంటైన్‌గా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తుండడంతో  అక్కడగల మౌలిక సదుపాయాలపై ఆమె కళాశాల ప్రిన్సిపా ల్‌ మౌళీకృష్ణను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని పశువైద్య క ళాశాల విద్యార్థులను శనివారం త్వరితగతిన ఖాళీ చేయాలని ఆదేశించారు. వెంటనే కరోనా పాజిటివ్‌ ఉన్నవారు క్వారంటైన్‌లో వసతి కలుగజేస్తామన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట క్వారంటైన్‌ నోడల్‌ ఆఫీసర్‌, ఆత్మా పీడీ చంద్రానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాఽధ, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, గోపవ రం గ్రామ పంచాయతీ సిబ్బంది గురుమోహన్‌ ఉన్నారు.

Updated Date - 2021-04-24T04:24:00+05:30 IST