జెండా మాస్టారు మృతి పట్ల సంతాపం తెలిపిన లోకేశ్

ABN , First Publish Date - 2020-08-03T18:56:22+05:30 IST

జెండా మాస్టారుగా ప్రసిద్ధి చెందిన నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్‌‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

జెండా మాస్టారు మృతి పట్ల సంతాపం తెలిపిన లోకేశ్

అమరావతి: జెండా మాస్టారుగా ప్రసిద్ధి చెందిన నిడుమోలు వెంకటేశ్వర ప్రసాద్‌‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘనంగా నివాళులు అర్పించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా లోకేశ్ ట్వీట్ చేస్తూ.. ప్రజా సమస్యలపై పోరాటమే ఊపిరిగా జీవించారని గుర్తు చేసుకున్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ ఉద్యమానికి ఆద్యుడని,  రాజకీయాలకు అతీతంగా ప్రజల మనస్సు గెలిచారని ట్వీట్ చేశారు. జెండా మాస్టారు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నట్టు తెలిపారు. మాస్టారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జెండా మాస్టారు భౌతికంగా మన మధ్య లేకపోయినా మచిలీపట్నం అభివృద్ధిలో ఆయన ఎప్పుడూ సజీవంగా ఉంటారని లోకేశ్ పేర్కొన్నారు. 



Updated Date - 2020-08-03T18:56:22+05:30 IST