కేసీఆర్ నిర్బంధం వల్లే ధాన్యం దిగుబడి తగ్గింది: జీవన్రెడ్డి
ABN , First Publish Date - 2022-04-18T23:37:44+05:30 IST
కేసీఆర్ నిర్బంధం వల్లే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగిబడి తగ్గిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: కేసీఆర్ నిర్బంధం వల్లే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి తగ్గిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరి వేయని రైతులు ఎకరాకు రూ. 25 వేలు నష్టపోయారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల సాగుకు రైతులు దూరం అయ్యారని మండిపడ్డారు. నష్టపోయిన వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని గ్రామాల్లో ధాన్యం సరిగా కొనకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని జీవన్రెడ్డి అన్నారు.