వీడనున్న బాలిక మృతి మిస్టరీ.. పోలీసుల అదుపులో యువకుడు!
ABN , First Publish Date - 2022-02-20T18:00:31+05:30 IST
జీడిమెట్లలో ఈనెల 14న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక
- ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోసం చూస్తున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : జీడిమెట్లలో ఈనెల 14న రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలిక మిస్టరీని ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. బాలిక బంధువుల సమాచారం మేరకు బాలికతో సన్నిహితంగా ఉన్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీ సందీప్, బాలానగర్ ఏసీపీ పురుషోత్తం ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. బాలిక ఒంటిపై 14చోట్ల తీవ్రమైన గాయాలయ్యాయని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. చివర గా ఎఫ్ఎ్సఎల్ రిపోర్టు కూడా వస్తే బాలిక మృతికి గల కారణాలను పోలీ సు లు అధికారికంగా వెల్లడించనున్నారు. కాగా, 14న రాత్రి 10.30 గంటల ప్రాం తంలో బాలిక వేగంగా నిర్మాణంలోని భవనం వరకు వచ్చి తర్వాత ఎక్కడికి వెళ్లిందన్న సీసీ ఫుటేజీ లేకపోవడంతో భవనంలోకే వెళ్లి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాగా తెలిసిన వాళ్లే బాలిక మృతికి కారకులై ఉంటారని వారు భావిస్తున్నారు.