ముగిసిన తొలి విడత జేఈఈ మెయిన్స్
ABN , First Publish Date - 2021-02-27T05:28:30+05:30 IST
ఐఐటీ, నిట్లలో ప్రవేశం కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
గుంటూరు(విద్య), ఫిబ్రవరి 26: ఐఐటీ, నిట్లలో ప్రవేశం కోసం నిర్వ హించే జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న ప్రారంభమైన పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. 15 కేంద్రా ల్లో నిర్వహించిన పరీక్షకు దాదాపు 6 వేల మందికిపైగా విద్యార్థులు హాజర య్యారు. ఇందులో దాదాపు 98 శాతం విద్యార్థులు పరీక్షను విజయవంతంగా ముగించినట్లు సిటీ కోఆర్డినేటర్ యలమంచిలి రధినిచౌదరి తెలిపారు. మరో మూడు విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.