18 నుంచి 23 వరకు జేఈఈ, 26న నీట్ పరీక్షలు: పాపిరెడ్డి
ABN , First Publish Date - 2020-07-04T00:44:45+05:30 IST
ఈ నెల 18 నుంచి 23 వరకు జేఈఈ, 26న నీట్ పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. జేఈఈ, నీట్ సాధ్యాసాధ్యాలపై నేషనల్ టెస్ట్ ఏజెన్సీ
హైదరాబాద్: ఈ నెల 18 నుంచి 23 వరకు జేఈఈ, 26న నీట్ పరీక్షలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. జేఈఈ, నీట్ సాధ్యాసాధ్యాలపై నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కమిటీ వేశామని చెప్పారు. శనివారం ప్రవేశ పరీక్షల నిర్వహణపై కేంద్రం నిర్ణయం తీసుకోనుందని. కేంద్ర నిర్ణయాన్ని బట్టి ప్రవేశ పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని పాపిరెడ్డి పేర్కొన్నారు.