సదస్సులో మాట్లాడుతున్న జేడీఏ

ABN , First Publish Date - 2021-04-17T06:01:10+05:30 IST

వేసవికాలంలో సాగుచేసే నువ్వులు, మినుము, పెసర పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జేడీఏ శ్రీరాంమూర్తి సూచించారు.

సదస్సులో మాట్లాడుతున్న జేడీఏ

పంటల్లో యాజమాన్య పద్ధతులు పాటించాలి

దర్శి, ఏప్రిల్‌ 16 : వేసవికాలంలో సాగుచేసే నువ్వులు, మినుము, పెసర పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జేడీఏ శ్రీరాంమూర్తి సూచించారు. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లా డారు. వ్యవసాయరంగంలో అధునాతన పద్ధతులను రైతులకు వివరించాలన్నారు. అనంతరం స్థానిక కృషి విజ్ఞానకేంద్రంలోని డిప్లోమా చదివిన విద్యార్థులకు ఆయన సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన అధికారి డాక్టర్‌ యస్‌.భారతి, కేవీకే పోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌, ఏరువాక కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వరప్రసాదరావు, ఉద్యానవనం పరిశోధన ప్రధాన అధికారి ముత్యాలనాయుడు, శాస్త్రవేత్తలు జాహ్నవి, ఉష, రాజే్‌షచౌదరి, రమేష్‌, జిల్లాలోని ఏడీఏలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T06:01:10+05:30 IST