జగనన్న లేఅవుట్లో జేసీ పరిశీలన
ABN , First Publish Date - 2022-01-28T03:15:13+05:30 IST
వెంకటగిరి - తిరుపతి మార్గంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్ను గురువారం జేసీ గణేష్, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డితో కలిసి సందర్శించారు.
అధికారులు సహకరించడం లేదని లబ్ధిదారుల ఫిర్యాదు
వెంకటగిరి, జనవరి 27: వెంకటగిరి - తిరుపతి మార్గంలో ఏర్పాటు చేసిన జగనన్న లేఅవుట్ను గురువారం జేసీ గణేష్, డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఆయనను కలిశారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అధికారులు సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. లేఔట్ విద్యుత్, నీటి సరఫరా కల్పించలేదని, ఈ సమస్యలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా పరిష్కరించడం లేదని ఆరోపించారు. అధిక ధరలకు బయటి ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న గ్రావెల్ పోలీసులు పెద్ద మొత్తాల్లో పెనాట్లీలు వేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఆయన ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఇళ్ళ నిర్మాణాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ 1.80 లక్షలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ విషయమై శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించ నున్నట్లు తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.