రైతులకు లబ్ధి చేకూరేలా ఎగుమతులు

ABN , First Publish Date - 2021-09-29T05:01:19+05:30 IST

పంటల ఎగుమతుల విషయంలో వ్యాపారులతో పాటు రైతులకు లబ్ధి చేకురాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్‌రెడ్డి అన్నారు.

రైతులకు లబ్ధి చేకూరేలా ఎగుమతులు
వాణిజ్య ఉత్సవ్‌లో స్టాల్స్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిదర్‌, కిలారి రోశయ్యలు

జేసీ శ్రీధర్‌రెడ్డి 

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు28: పంటల ఎగుమతుల విషయంలో వ్యాపారులతో పాటు రైతులకు లబ్ధి చేకురాలని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) కె.శ్రీధర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లోని శంకరన సమావేశ మందిరంలో ఆజాదికా అమృత మహోత్సవ్‌ వాణిజ్య ఉత్సవాలను ఎమ్మెల్యేలు ముస్తఫా, గిరిధర్‌, కిలారి రోశయ్యలతో కలసి మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ 2030 నాటికి ఎగుమతులు రెట్టింపు చేయాలన్న  ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఇనఛార్జ్‌ మేనేజర్‌ ప్రసాదు, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపికృష్ణ, స్పిన్నింగ్‌ మిల్లుల అసోసియేషన అధ్యక్షుడు రఘురామిరెడ్డి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రాంబాబు, ఉద్యావనశాఖ డీడీ సుజాత, చిల్లీస్‌ ఎగుమతిదారుల సంఘ కార్యదర్శి రామకృష్ణ, యూనియన బ్యాంకు ఆఫ్‌ ఇండియా తిలక్‌, నాబార్డు జీఎం కార్తీక్‌, ఈసీజీసీ బీఎం ప్రశాంత తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-09-29T05:01:19+05:30 IST