‘నాడు-నేడు’ పనుల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-06-04T08:53:02+05:30 IST

జిల్లాలో నాడు-నేడు పనుల వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ..

‘నాడు-నేడు’ పనుల్లో  సమస్యలు పరిష్కరించాలి

 జేసీ ప్రశాంతికి ఫ్యాప్టో నేతల వినతి 


గుంటూరు (విద్య), జూన్‌ 3: జిల్లాలో నాడు-నేడు పనుల వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఫ్యాప్టో (ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య) నాయకులు విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావుతో కలిసి జాయింట్‌ కలెక్టర్‌ (సచివాలయాలు) పి.ప్రశాంతికి బుధవారం వినతిపత్రం అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా కోనుగోలు చేసిన మెటీరియల్‌కు ఇంకాబిల్లులు చెల్లించలేదని పేర్కొన్నారు.


కొన్నిపాఠశాలల్లో తాగునీరు, నిర్మాణాలకు నీళ్లులేక ఇబ్బందులు వసున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ చార్జీలు కూలీలకు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా పలు సమస్యలను జేసీ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు కె.బసవలింగరావు, కె.నరసింహారావు, పి.ప్రేమ్‌కుమార్‌, ఎస్‌.రామచంద్రయ్య, ఎం.సుబ్బారావు, ఆర్థిక కార్యదర్శి ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు నాగమల్లేశ్వరరావు, పెదబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T08:53:02+05:30 IST