జర్నలిస్టులకు ప్రత్యేక వార్డు
ABN , First Publish Date - 2020-08-12T10:49:35+05:30 IST
కరోనా బారినపడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా రూములు, వార్డు కేటాయించి చికిత్స చేయిస్తున్నట్లు జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు.
నెల్లూరు (వైద్యం), ఆగస్టు 11 : కరోనా బారినపడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా రూములు, వార్డు కేటాయించి చికిత్స చేయిస్తున్నట్లు జేసీ ప్రభాకర్రెడ్డి తెలిపారు. మంగళవారం జీజీహెచ్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్, సామ్నా జిల్లా అధ్యక్షుడు హనూక్, పలువురు జర్నలిస్టులు జేసీని కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రముఖ హోటల్లో పది రూములు, జీజీహెచ్లో ఓ వార్డును ఏర్పాటు చేస్తామన్నారు. కరోనా సమయంలో మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.